VKB: పెద్దేముల్ మండల మదనంతాపూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 8 ట్రాక్టర్ల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు, ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేశామని వివరించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.