JGL: మెట్పల్లి మార్కెట్లో నేడు పసుపు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటాల్కు గరిష్ఠంగా కాడి రూ .16,000, గోళ రూ .14,509, చూర రూ. 12,222 పలికాయి. కనిష్ఠ ధరలు రూ.9,100 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 2,346 క్వింటాళ్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.