NRPT: నారాయణపేట మండలం అంతారం ఆశ్రమంలో 510వ శివరామనామ జప యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. సంజీవయ్య, జగదీశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన శనివారం భక్తులు దంపతులతో కలిసి పాల్గొన్నారు. సోమవారం వరకు జరిగే ఈ యజ్ఞంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. గ్రామ కార్యకర్తలు రమేశ్, ఆనంద్, శ్రీను ఏర్పాట్లను పర్యవేక్షించారు.