KMR: పిట్లం మండలంలోని చిన్న కోడపల్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన భజరంగ్ శుక్రవారం రాత్రి కాలకృత్యాల కోసం ఇంటి సమీపంలోని రెడ్డి చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.