మహబూబ్ నగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఆదివారం సుభాష్ నగరంలోని వైశ్య వసతి గృహంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు సీఈవో రాజేంద్ర కుమార్ తెలిపారు. పాలకవర్గ సభ్యులు, వాటాదారులు అందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ భేటీలో బ్యాంక్ వ్యాపార, అభివృద్ధి అంశాలపై చర్చ జరగనుంది.