BHPL: గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన నగావత్ జ్యోతి-కిషన్ నాయక్ కుమార్తె వివాహ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.