NGKL: తిమ్మాజిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపడుతున్న పనులను టెక్నికల్ ఏపీవో సత్యనారాయణ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పని ప్రదేశాన్ని కూలీలకు దినసరి వేతనంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రూ.307 వచ్చే విధంగా పనులు చేయాలని కూలీలకు తెలిపారు. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు పనులు చేయాలని కోరారు.