BHNG: గుండాల మండలంలోని పలు గ్రామాల్లో పొట్టకొచ్చిన వరి చేలు నీరు లేక నెర్రెలుబారి ఎండిపోతున్నాయి. వరి పంట పాలు పోసుకునే దశలో నీరు అధికంగా అవసరం. బోర్లు, బావుల్లో నీరు లేకపోవడంతో రైతులు వరుస తడులపై పంటలకు నీరందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరుస తడులకు నీరందక పంటలను పూర్తిగా గొర్రెల మేతకు వదిలేస్తున్నారు.