NGKL: పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలిసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీశ్రీశ్రీ పబ్బతి అంజనేయ స్వామినీ శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో రూ. 4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.