KKD: పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ దీన్ని పర్యవేక్షిస్తున్నారు.