భద్రాద్రి: ఇల్లందుకు తాగునీరు అందించే ఇల్లందులపాడు చెరువు చెత్తాచెదారంతో కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువును శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చెరువు వద్ద రాత్రి వేళల్లో జరిగే మందుబాబుల హంగామాను అరికట్టాలన్నారు.