JGL: పెగడపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి సర్పంచ్ అరుణ ఆధ్వర్యంలో శానిటరీ వస్తువులను పంపిణీ చేశారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గాను శానిటరీ వస్తువులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.