ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ను ఆదివాసి సంఘం నాయకులు పట్టణంలోని MP నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 23, 24, 25 తేదీలలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమం వాల్ పోస్టర్లను MP ఆవిష్కరించారు. నాయకులు గంగాధర్ రావు, వెంకన్న, రమేష్, వామన్, చంద్రకాంత్ తదితరులున్నారు.