పాక్ ప్లేయర్ల ముంగిట తమ క్రికెట్ బోర్డ్(PCB) సాగిలపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంత బలహీనంగా PCBని గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుత పాలక బోర్డ్ వల్ల ఏం కాదని విమర్శించాడు. కొత్త ప్లేయర్లను తీసుకొచ్చే అవకాశం ఉన్నా ప్రతిసారీ ఉన్న ప్లేయర్లతోనే ఏదో ట్రిక్ ప్లే చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశాడు.