కోనసీమ: గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలమూరు ఎస్సై నరేంద్ర అన్నారు. మండలంలోని చింతలూరులో ఆయన శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఉగాది సందర్భంగా నిర్వహించే శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.