ELR: పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు 36 అనే వ్యక్తి గత కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ.. ఈనెల 5వ తేదీన మృతి చెందాడు. ఆ కుటుంబ పరిస్థితిని గ్రామ పెద్దలు, పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మృతుని దశదిన కార్యక్రమం నిమిత్తం పెదపాడు పోలీస్ స్టేషన్ తరఫున 75 కిలోల 3 బియ్యం బస్తాలను అందజేసినట్లు తెలిపారు.