PDPL: ముత్తారం మండలం ఖమ్మంపల్లి – తాడిచర్ల వంతెన వద్ద మానేరు వాగు ఎడారిగా మారింది. మానేరు వాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ఎండలు ముదరకముందే చిన్నపాటి ప్రవాహం కూడా కనుమరుగై ఇసుక తిన్నెలు తేలాయని వాపోతున్నారు. మరికొద్దిరోజుల్లో నిండు వేసవి దృష్ట్యా సాగునీటి ఎద్దడికి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.