ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన కార్యాలయాన్ని భారత్కు మార్చుకుంది. ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ను గ్రూప్ ప్రధాన సంస్థగా మార్చే అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ సంస్థ, పూర్తి స్థాయి దేశీయ కంపెనీగా తదుపరి దశ వృద్ధి కోసం ఎదురుచూస్తోంది.