PLD: పెదకూరపాడులో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా కార్యకర్తలు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ వలిగొండ రెడ్డి ఆదిత్య మాట్లాడుతూ.. దోమల నివారణకై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల వలన అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.