KRNL: మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారిపై దాడి జరిగింది. టెండర్ ద్వారా షాప్ నిర్వహిస్తున్న పూర్ణచంద్ర వద్దకు రవి అనే వ్యక్తి చేరుకుని, షాప్ తెరవవద్దని బెదిరించినట్లు పూర్ణ చంద్ర తెలిపారు. అనంతరం తనపై దాడి చేసి, షాప్లోని వస్తువులను ధ్వంసం చేసి తాళం వేసి వెళ్లిపోయినట్లు బాధితుడు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.