NTR: కంచికచర్లలోని ప్రధాన రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంధన కొరత నేపథ్యంలో డీజిల్ కోసం భారీ వాహనాలు బంకుల వద్ద రహదారిపైనే క్యూ కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.