TPT: వెంకటగిరి నియోజకవర్గంలో VOAలకు సుమారు రూ. 30 లక్షల విలువైన 5G స్మార్ట్ఫోన్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టడంలో VOAలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యమన్నారు.