TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో ఏపీ ఏలూరు TDP ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరందరికి డ్రగ్స్ టెస్ట్ చేయగా.. రోహిత్ రెడ్డితో సహా ఐదుగురికి పాజిటివ్ రాగా, టీడీపీ ఎంపీకి నెగటివ్ వచ్చింది.