ATP: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. జిల్లాలో 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, సుమారు 31 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.