HYD: ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇవాళ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయని తెలిపారు.