JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి శనివారం రూ.3,63,024 ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ సేవల ద్వారా ఈ మొత్తం సమకూరింది. టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,74,228, ప్రసాదాల ద్వారా రూ. 1,40,430 ఆదాయం రాగా.. అన్నదానానికి భక్తులు రూ. 48,366 విరాళంగా అందజేశారు.