MLG: వాజేడు మండలం పెరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లారంలో నిన్న ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఇంటిని మాజీ జడ్పీ ఛైర్మన్ బడే నాగజ్యోతి పరిశీలించి బాధితరాలు రాధకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు. ఇల్లు దగ్ధమైన మహిళకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాగజ్యోతి కోరారు.