WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం మహిళలకు ఆర్థికంగా పెద్ద ఎత్తున సహాయం అందిస్తూ భరోసా కల్పించిందని MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట RTC ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మహిళలు స్వావలంబన వైపు ముందుకు నడిపిస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.