SRPT: జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని DMHO డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చొరవతో రూ.15 లక్షలతో ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చామన్నారు. ఫలితంగా నెలకు 4 ఉన్న ప్రసవాలు 12కు పెరిగాయని, మాతాశిశు సంరక్షణలో జిల్లా రాష్ట్రంలోనే ముందుందని ఆయన పేర్కొన్నారు.