JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం మాజీ MLA తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత MLA కడియం శ్రీహరి స్పీకర్ విచారణలో చూపిన ఫోటోలను AI ద్వారా మార్చారని, BRS పార్టీలో ఉన్నానని అబద్ధాలు చెబుతున్నారని అనడం సిగ్గుచేటు అన్నారు. MLA కడియం పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు.