MNCL: కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.