MDK: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన లోక్ అదాలత్లో విశేష స్పందన వచ్చింది. కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 5,454, సంగారెడ్డి జిల్లాలో 4,868, మెదక్ జిల్లాలో 2,583 కేసులు పరిష్కారంమైనట్లు అధికారులు తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామన్నరు.