MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పంట ఉత్పత్తుల ధరల వివరాలను కార్యదర్శి అశోక్ అహ్మద్ తెలిపారు. వేరుశనగకు గరిష్ఠ ధర రూ. 10,119 కనిష్ఠ ధర రూ.5265 లభించగా, మొక్కజొన్నకు గరిష్ఠ ధర రూ.1854, కనిష్ఠ ధర రూ.1781 లభించింది. పత్తికి గరిష్ఠ ధర రూ.6129 కనిష్ఠ ధర రూ.4029 లభించింది. జొన్నలకు గరిష్ఠ ధర రూ.5230, మినుముల గరిష్ఠ ధర రూ.7,879 ధర లభించింది.