GDWL: అయిజ పట్టణంలోని 1వ వార్డులో బుధవారం డ్రైనేజీల ప్రక్షాళన, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ చిన్న సురేశ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ తిరుమలేశ్, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డులో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.