MLG: ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి- గిరివాణి దర్బార్లో 96 ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.