TG: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపడానికి కేంద్రం తక్షణమే చొరవ తీసుకోవాలని కోరుతూ Dy CM భట్టి విక్రమార్క శాసనసభలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాంతి స్థాపనలో భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను అరికట్టేందుకు దౌత్యపరమైన చర్చలు జరపాలని సభ కోరింది.