EG: ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన p4 విధానాన్ని రాజానగరం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి ఇవాళ అభినందించారు. p4 స్ఫూర్తితో వెదుళ్ళపల్లి స్కూల్ భవన నిర్మాణము, భోజనశాలకు కాంపౌండ్ వాల్కు సొంత నిధులు యాజమాన్యానికి అందజేశారు. దాతల స్ఫూర్తిని కొనియాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీరన్న చౌదరిని సన్మానించారు.