PDPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పట్టణాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహీద్ మసూద్ శానిటేషన్ పనులను పరిశీలించారు. 32వ వార్డులో శుభ్రత కార్యక్రమాలు, మినీ ట్యాంక్ బండ్, చందపల్లి నర్సరీలను పరిశీలించి మున్సిపల్ సేవలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.