BDK: కొత్తగూడెం కార్పొరేషన్లో పాల్వంచ పేరును చేర్చాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఊపందుకుంది. ఇటీవల సుజాతనగర్ లోని 7 గ్రామాల విలీనంతో 60 డివిజన్లుగా కార్పొరేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్పొరేషన్ పేరులో తమ ప్రాంత గుర్తింపు ఉండాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, కోర్టు కేసుల వల్ల పాల్వంచ మున్సిపాలిటీకి ఏళ్ల తరబడి ఎన్నికలు జరగలేదు.