RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ అద్భుతమైన సైన్స్ ప్రదర్శనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్సు ప్రాజెక్టులను కౌన్సిలర్ మురళి మోహన్ తిలకించి అభినందించారు. వివిధ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.