BDK: వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్సై రమేశ్ హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని వారు సూచించారు. ఇవాళ పట్టణంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.