SRPT: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఐదు నెలలుగా జీతాలు లేక అద్దెలు కట్టలేక, వైద్య ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1లోగా సమస్య పరిష్కరించకుంటే విధులను బహిష్కరిస్తామని అన్నారు.