KMR: పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి అన్నారు. ఆదివారం చిన్న కొడప్గల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యానికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.