KMM: ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ మోహన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం రూరల్ మండల పీహెచ్సీ వద్ద నిరసన చేపట్టి వైద్యాధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.