కరీంనగర్ కలెక్టరేట్లో ఇవాళ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సన్నాహక సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.