PDPL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. వేద పండితులు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో స్వామివార్లకు అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు స్వామివారికి తులాభారం నిర్వహించారు. గ్రామస్తుల సౌజన్యంతో విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్నదానం చేశారు.