KNR: నగర ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే పాలకవర్గ ధ్యేయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 48వ డివిజన్లో రూ.10 లక్షల వ్యయంతో పైపులైన్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్య మిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టామని, మానేరు డ్యాంలో 10 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూస్తామన్నారు.