NLG: చౌటుప్పల్ సమీపంలోని బోర్రోల గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, నిలిపి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన డ్రైవర్ మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.