AP: సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం వేటను నిషేధించింది. మెకనైజ్డ్ బోట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తించనుండగా.. సాధారణ పడవలకు మినహాయింపు కల్పించింది. ఈ 61 రోజులు ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఆసరాగా రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. మే నెలలోనే ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించింది.