W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున సామివారి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను ఊరేగించారు. ఈ నెల 12న ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.